అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం యూఎస్ఏతో జరిగే మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓ మార్పుతో బరిలోకి దిగనుందని తెలుస్తోంది. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ఆల్ రౌండర్ శివమ్ దూబేని జట్టు నుంచి తప్పించాలని మేనేజ్ మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అతడి స్థానంలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ని జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. టీ20 డబ్ల్యూసీకి ఎంపికైనప్పటి నుంచి శివమ్ దూబే ఫామ్ కోల్పోయి పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.