ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉగ్రదాడుల మాటేమిటి?: అజయ్‌ రాయ్‌

67చూసినవారు
ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉగ్రదాడుల మాటేమిటి?: అజయ్‌ రాయ్‌
జమ్ము కశ్మీర్‌లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్‌పై దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ రాయ్‌ డిమాండ్‌ చేశారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత ఉగ్రవాదం సమసిపోయిందని, అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొందని బీజేపీ నేతలు చెప్పుకున్నారని విమర్శించారు. ఇదంతా ప్రచార ఆర్భాటమేనని రాయ్‌ అన్నారు. ఈ ఉగ్రదాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్