వర్షాలు తగ్గగానే వంతెన నిర్మాణం చేపడుతాం: ఎమ్మెల్యే

65చూసినవారు
వర్షాలు తగ్గగానే వంతెన నిర్మాణం చేపడుతాం: ఎమ్మెల్యే
వర్షాలు తగ్గగానే ఖానాపూర్ మండలం గాంధీనగర్ కాలనీ శివారులో ఉన్న రెంకొనా వాగుపై వంతెనను పూర్తి చేస్తామని శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. ఇటీవల భారీ వర్షాలతో ఆ వాగుపై కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డును ఆయన సందర్శించి పరిశీలించారు. వర్షాలు తగ్గగానే వంతెనను పూర్తి చేస్తామని, అంతవరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలిక రోడ్డుకు మరమ్మతులు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్