ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం, సదర్ మాట్ ఆయకట్టు వరకు సాగునీరు వస్తుందో, లేదో అధికారులు స్పష్టం చేయాలని పలు మండలాల రైతులు కోరారు. వర్షాకాలం ప్రారంభమైనా నేపథ్యంలో అధికారులు ఆయా ప్రాజెక్టులకు మరమ్మతులు పూర్తి చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల ప్రధాన, అనుబంధ కాలువలకు ఇంకా మరమ్మతులు చేయలేదని, సాగునీటిని విడుదల చేస్తే లీకేజీ ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. అన్ని కాలువలకు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు.