మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందు

56చూసినవారు
జన్నారం పట్టణంలో నిర్వహించే వారసంతలో మౌలిక సౌకర్యాలు లేక చిరు వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి మంగళవారం జన్నారం పట్టణంలో వారసంతను నిర్వహిస్తారు. దీనికి వివిధ ప్రాంతాల నుండి చిరు వ్యాపారులు వచ్చి వారి వస్తువులను ప్రజలకు అమ్ముతుంటారు. అయితే మార్కెట్లో తాగునీరు, మరుగుదొడ్లు మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. వారసంతలో మౌలిక సహకారాలు కల్పించాలని అధికారులను వారు కోరారు.

సంబంధిత పోస్ట్