మహిళల రక్షణ అందరిదీ బాధ్యత

70చూసినవారు
మహిళలను, యువతులను, విద్యార్థినులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు అందరిదని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ అన్నారు. సోమవారం సాయంత్రం జన్నారం పట్టణంలోని రామ్ నగర్ లో కాలనీ మహిళలతో కలిసి ఆమె రక్షాబంధన్ నిర్వహించారు. కోల్కత్తాలో ట్రైనీ డాక్టర్ ను హత్యాచారానికి గురి చేయడం సభ్య సమాజానికే మాయని మచ్చన్నారు. అలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్