మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన

65చూసినవారు
జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో ఉన్న ప్రజలకు మలేరియా నివారణపై జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం తపాలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రజలకు మలేరియా నివారణకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కమలాకర్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్