పూర్తి రుణమాఫీ చేయాలని ఆందోళన

77చూసినవారు
పూర్తి రుణమాఫీ చేయాలని ఆందోళన
రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని కోరుతూ కడెం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వారు కడెం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందని, ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కడెం బిఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్