మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారి

53చూసినవారు
మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారి
భైంసా పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలను శనివారం ఆదిలాబాద్ జిల్లా విజిలెన్స్ అధికారి రవి చరణ్ రెడ్డి తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో కొనసాగుతున్న బోధన, భోజన సౌకర్యాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ జబ్బర్, వైస్ ప్రిన్సిపల్ సాయినాథ్, నర్సింగ్, దీప్తి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్