త్రైమాసిక ఫలితాలను హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. గత ఆర్థిక ఏడాది చివరికి త్రైమాసికంలో బ్యాంకు రూ.17,622.38 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.17,257.87 కోట్లతో లాభం 2.11 శాతం మేర పెరిగింది. స్టాండర్డ్లోన్ పద్ధతిలో డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.16,372.54 కోట్ల నుంచి రూ.16,511.85 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఏడాదికి రూ.64,060 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.