జగన్ పై రాయి దాడి ఘటనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ పై రాయి పడిన మాట వాస్తవమేనని అన్నారు. ఆ రాయి నుదుటిపై తగిలింది కానీ, కణితికి తగిలితే ప్రమాదం కాదా, కావాలని ఎవరైనా తలపై రాయితో కొట్టించుకుంటారా? అని ఆయన అన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభల్లోనూ రాళ్ళు విసిరారని, అయితే అవి వాళ్ళకు తగలలేదని అన్నారు.