ఏపీ రాళ్ళ రాజకీయాలపై స్పందించిన ఉండవల్లి

54చూసినవారు
ఏపీ రాళ్ళ రాజకీయాలపై స్పందించిన ఉండవల్లి
జగన్ పై రాయి దాడి ఘటనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ పై రాయి పడిన మాట వాస్తవమేనని అన్నారు. ఆ రాయి నుదుటిపై తగిలింది కానీ, కణితికి తగిలితే ప్రమాదం కాదా, కావాలని ఎవరైనా తలపై రాయితో కొట్టించుకుంటారా? అని ఆయన అన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభల్లోనూ రాళ్ళు విసిరారని, అయితే అవి వాళ్ళకు తగలలేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్