కోలూర్‌లో మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

79చూసినవారు
కోలూర్‌లో మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
తానూర్ మండలంలోని కోలూర్ గ్రామానికి చెందిన దేవరే మారుతి (45) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. తన కూతురి పెళ్లి చేయడానికి అప్పు చేశాడు. అప్పు చెల్లించలేక మద్యానికి బానిసై బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు.

కాగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కోలూర్ తండా నుంచి మసల్గా వెళ్లే రోడ్డు పక్కన వ్యవసాయ బావిలో మద్యం మత్తులో బావిలో దూకి చనిపోయి ఉన్నాడని మృతిని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్