దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 75,636.5 పాయింట్ల వద్ద ఆల్టైమ్ గరిష్ఠాలను తాకగా.. నిఫ్టీ తొలిసారి 23 వేలు దాటి 20,026 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. సెన్సెక్స్ ఉదయం 75,335.45 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమై.. తర్వాత లాభాల్లోకి వెళ్లింది. సూచీలు.. చివరికి 7.65 పాయింట్ల నష్టంతో 75,410.39 పాయింట్ల వద్ద ముగిసింది. నిప్టీ 10.55 పాయింట్లు కోల్పోయి 22,957.10 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ 83.10గా ఉంది.