రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకూ తాను జైల్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని మొత్తం 70 స్ధానాలనూ గెలుచుకుంటుందని ఢిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. తమ ఎమ్మెల్యేలందరినీ జైల్లో నిర్బంధించి ఎన్నికలు జరపండని కేజ్రీవాల్ కేంద్రానికి సవాల్ విసిరారు. ప్రజలు అమాయకులని కాషాయ పాలకులు భావిస్తున్నారని అన్నారు.