ఈఎంటీ లక్ష్మణ్ రాష్ట్ర స్థాయి అవార్డు

52చూసినవారు
ఈఎంటీ లక్ష్మణ్ రాష్ట్ర స్థాయి అవార్డు
కుబీర్ మండలం చాత గ్రామానికి చెందిన పూజారి లక్ష్మణ్ 108లో ఈఎంటీగా పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ సకాలంలో స్పందించి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడడంతో ఆయనకు 108 గ్రీన్ హెల్త్ సర్వీసెస్ హైదరాబాద్ సంస్థ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డు ఈనెల 22వ తేదీన సోమవారం జీవీకే ఈఎంఆర్ఐ రాష్ట్ర రాజధాని ప్రధాన కార్యాలయంలో ప్రధాన అధికారి ఎంఏ ఖలీద్ సర్టిఫికెట్ నగదు అవార్డును అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్