ముధోల్లో ఘనంగా కుస్తీ పోటీలు

77చూసినవారు
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ముధోల్ మండల కేంద్రంలోని జఠశంకర్ ఆలయ ప్రాంగణంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలు ప్రారంభించారు. తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్ర నుంచి మల్లయోధులు పెద్ద సంఖ్యలో పోటీల్లో తలపడ్డారు. గెలుపొందిన విజేతలకు వెండి కడియం నగదు బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలను వీక్షించడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్