హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని ఎంపిడిఓ మోహన్ సింగ్ అన్నారు. బుధవారం తానూర్ మండలంలోని బెల్తారోడా, భోరిగాం గ్రామాల్లోని నర్సరీలను, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. హరితహారంలో నాటిన మొక్కలు వేసవిలో ఎండిపోకుండా నీటిని అందించాలన్నారు. నర్సరీల్లోని మొక్కలను కూడా నాణ్యతతో పెంచాలన్నారు. ఇందుకు సంబంధించిన పలు రికార్డులు పరిశీలించి సూచనలు సలహాలు చేశారు.