గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

54చూసినవారు
గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం బాసరలో చోటుచేసుకుంది. ఎస్ఐ గణేష్ వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన దత్తు (45) ఆరునెలల కిందట యాసిడ్ తాగాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్