వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భైంసా పట్టణంలోని వారి నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మట్టి వినాయకుని ప్రతిష్టించి పూజించారు. ఈ సందర్భంగా మహా గణపతికి మంగళ హారతిని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మహాగణపతి ఆశీస్సులు ఉండాలని, సుఖసంతోషాలతో జీవించాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.