పిల్లలకు వాహనాలిస్తే కఠిన చర్యలు: సిఐ

1559చూసినవారు
మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని భైంసా పట్టణ సిఐ రాజా రెడ్డి హెచ్చరించారు. సోమవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు సెలవులు ఉన్నందున రాత్రి వేళల్లో మైనర్లు ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్నరని అన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తమ నిఘాలో పిల్లలు బైక్ లు నడుపుతూ కంటపడితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్