కేంద్రమంత్రికి స్వాగతం పలికిన బీజేఎల్పీ నేత

58చూసినవారు
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్ కు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి ఘనంగా స్వాగతించారు. అనంతరం రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఇరువురు చర్చించారు. మూడోసారి నరేంద్ర మోడీనీ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్