బీజేపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్ లు

1559చూసినవారు
బీజేపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్ లు
ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామ చేసిన నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్ లు రమాదేవి పద్మాకర్, బిట్లింగ్ నవీన్, ఎడపెల్లి నరేందర్ లు శనివారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్టు వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్