టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవల పోలీసులతో గొడవపడినట్లు వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇది తన కొత్త సినిమా కోసం చేసిన ప్రమోషన్ స్టంట్ అని తెలిసిపోయింది. నివేదా పేతురాజ్ తాజాగా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘పరువు’. ఈ మూవీ ప్రమోషన్స్ కోసమే నివేదా ఇలా చేసినట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. నివేదా నటన ఆకట్టుకుంటోంది.