ఆర్మూర్ మండలంలో బుధవారం విషాదం నెలకొంది. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త శ్రీనివాస్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోవింద్ పేట్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కు భార్యతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లడంతో శ్రీనివాస్ మనస్తాపానికి గురైయ్యాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.