వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఉదయం స్వామివారికి అలంకరణ పంచామృత అభిషేకం చేశారు. భక్తులకు ప్రసాద వితరణ మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సత్రం నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి అరవింద్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు స్వాములు పాల్గొంటారు.