దక్షిణ ముంబైలోని ఓ షాపింగ్ సెంటర్లోని లేడీస్ వాష్రూమ్లో 35 ఏళ్ల మహిళకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. బాధితురాలు వృత్తిరీత్యా న్యాయవాది. ఏప్రిల్ 18న ఓ షాపింగ్ సెంటర్లో వాష్రూమ్కు వెళ్లింది. ఆ సమయంలో సందీప్ పాండే (21) అనే వ్యక్తి అప్పటికే వాష్రూమ్లో ఉన్నాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడిని కొట్టి ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.