కాకతీయ మెయిన్ కెనాల్ లో వ్యక్తి గల్లంతు

84చూసినవారు
కాకతీయ మెయిన్ కెనాల్ లో వ్యక్తి గల్లంతు
శ్రీరామ్ సాగర్ కాకతీయ మెయిన్ కాలువలో బుధవారం మధ్యాహ్నం వ్యక్తి గల్లంతయ్యాడు. వినాయక నిమజ్జనం సందర్భంగా మెండోరా వద్ద ఎల్ఎండి కాలువలో దిగి గల్లంతయాడన్న సమాచారంతో ప్రాజెక్టు అధికారులు కాకతీయ మెయిన్ కెనాల్ కు నీటి విడుదలను నిలిపివేశారు. వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వ్యక్తి ఆచూకీ లభించిన తర్వాత తదుపరి తిరిగి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్