చిరుత సంచరిస్తుంది జాగ్రత్త

16908చూసినవారు
చిరుత సంచరిస్తుంది జాగ్రత్త
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం శివారు వ్యవసాయ పరిశోధన కేంద్ర భూముల్లో చిరుత సంచరిస్తున్నట్లు గురువారం అధికారులు తెలిపారు. పొలంలో అడవి పందిని చంపినట్లు అక్కడి కార్మికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అడవి రేంజ్ అధికారి చంద్ర ప్రకాష్ సిబ్బందితో వచ్చి గుర్తులు పరిశీలించి చిరుత సంచరిస్తుందన్నారు. దాన్ని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి వేళలో బయటకు ఎవరు రావద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్