రైలు నుంచి జారి పడి వ్యక్తి దుర్మరణం

8279చూసినవారు
రైలు నుంచి జారి పడి వ్యక్తి దుర్మరణం
నవీపేట్ రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కదులుతున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడి మృతి చెందాడని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. మృతుని వయసు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. పసుపు రంగు టీ షర్టు, నలుపు రంగు డబ్బాల ప్యాంటు ధరించాడని ఎవరైనా గుర్తు పడితే ఫోన్ నెంబర్ 8712658591ను సంప్రదించాలని ఎస్సై కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్