రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

11725చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నవీపేట మండల కేంద్రానికి చెందిన సాయిరెడ్డి బైక్ పై నిజామాబాద్ కు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిరెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సాయిరెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్