చెట్టుకు కారు ఢీకొని మహిళ మృతి

17975చూసినవారు
నవీపేట్ మండలంలోని జగ్గారావు ఫారం వద్ద చెట్టుకు కారు ఢీకొని సులోచన(52) మృతి చెందినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ మంగళవారం తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని కోటగల్లికి చెందిన సులోచన భర్త సుదర్శన్ తో పాటు అనిత, సునీత, కవిత కారంపొడి తీసుకువచ్చేందుకు ఉదయం మహారాష్ట్ర ధర్మబాద్ కి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో సులోచన అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్