బోధన్: ఘనంగా అమ్మవారి శోభాయాత్ర

81చూసినవారు
బోధన్: ఘనంగా అమ్మవారి శోభాయాత్ర
బోధన్ పట్టణంలోని శ్రీచెక్రేశ్వర శివాలయం నుండి సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో దంపతులు, ఏసిపి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్య దామోదర్, కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ గంగాధర్ రావు పట్వారీ, సార్వ జనక్ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. శోభాయాత్రలో భవాని దీక్షపరుల భజనలు, కీర్తనలతో ఘనంగా సాగింది.

సంబంధిత పోస్ట్