ధర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన భవనాన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర చైర్మన్ శోభ శుక్రవారం ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, లక్ష్మీదేవి చిత్రపటానికి పూలమాలవేసి వేద పండితులచే పూజా కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.