ఇందూరులో డైమండ్ జేసీఐ 2024 ప్రారంభం

5422చూసినవారు
ఇందూరులో డైమండ్ జేసీఐ 2024 ప్రారంభం
నిజామాబాద్ లోని ఇందూరులో జేసీఐ జోన్ Xll డైమండ్ జేసీఐ 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. సెప్టెంబర్ 9 నుండి 15 వరకు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు తయారుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా జేసీఐ వారం కో ఆర్డినేటర్ Jc నయన్ చేత జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.సంస్థకు దీర్ఘకాలం సేవలు అందించిన జేసీ వెంకట్ రమణ గౌడ్, విజయానంద్ మరియు శ్రీహరిలను ఘనంగా సన్మానించారు. జేసీఐ నిజామాబాద్ ఇందూరు అధ్యక్షుడు జేసీ మనోజ్ కుమార్ మాట్లాడారు..సమాజాన్ని ఉత్తేజితం చేయడానికి ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు.జేసీఐ వారం 2024 ప్రోగ్రాం అనేది అనేక ప్రభావంతమైన కార్యక్రమాలతో కొనసాగుతుందని,సమాజానికి సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జేసీ వినోద్ నాయక్, జేసీ జైపాల్, జేసీ విజయ్ కుమార్, జేసీ ప్రవీణ్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్