స్కీముల పేరిట ఘరానా మోసం

84చూసినవారు
స్కీముల పేరిట ఘరానా మోసం
జుక్కల్ నియోజకవర్గం మహమ్మద్ నగర్ మండలంలోని సింగితం, షేర్ఖాన్ పల్లి గ్రామాలకు ఈనెల 25న ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. బాన్సువాడలో కొత్తగా ఎలక్ట్రానిక్ షాప్ పెట్టామని, నెలకు 3వేలు చెల్లిస్తే ఫ్రిజ్, బీరువాలు ఇస్తామని అమాయకులను నమ్మించి వారి వద్ద నుండి దాదాపు 2 లక్షల వరకు కట్టించుకుని కనపడకుండా వెళ్లారు. ఫోన్ లు కలవడంలేదు అని తమకు న్యాయం చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్