యువకుడి ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

13682చూసినవారు
తల్లిదండ్రులతో గొడవపడి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన ఓ యువకుడిని రైల్వే, పట్టణ పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. బిబిపేట్ మండలం జనగామ గ్రామానికి చెందిన చాకలి వినయ్ కుమార్ తల్లిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కామారెడ్డికి వచ్చిన వినయ్ కుమార్ డయల్ 100కు ఫోన్ చేసి తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై యువకుడ్ని కాపాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్