నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం అటవీ ప్రాంతం దగ్ధమవుతోంది. శుక్రవారం ఎండ వేడిమితో మల్లారం అటవీ ప్రాంతంలోకి మంటలు వ్యాపించాయి. అడవి దగ్ధమైతే అందులో ఉండే వన్యప్రాణులు జన వాసంలోకి వచ్చే అవకాశం ఉంది. అటవీశాఖ అధికారులు స్పందించి మల్లారం అడవిని కాపాడాలని స్థానికులు కోరారు.