మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

73చూసినవారు
మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులైన వివిధ శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, మండల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్