బావపై దాడి చేసిన బావమరిది.. ముగ్గురికి రిమాండ్

10363చూసినవారు
బావపై దాడి చేసిన బావమరిది.. ముగ్గురికి రిమాండ్
అక్కను కాపురానికి తీసుకెళ్లడం లేదని బావమరిది బావపై దాడి చేసిన ఘటనలో శుక్రవారం ముగ్గురికి రిమాండ్ విధించారు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లికి చెందిన శ్యామల,మెదక్ జిల్లా కూచారం వాసి అరుణ్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ల ఇద్దరి మధ్య గొడవలు రావడంతో శ్యామల పుట్టింటికెళ్లింది. అక్కను తీసుకెళ్లాలని బావమరిది శ్యాంసుందర్ అరుణ్ ను కోరినా ఫలితం లేదు. ఇద్దరు స్నేహితులతో జనవరి 30న అరుణ్ పై కత్తితో దాడి చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్