ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు

77చూసినవారు
ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని ఆర్కే పురమ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపు మెయిల్‌తో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు చెప్పారు. బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టగా, ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్