కరెంటు కోతలపై గిరిజనుల సబ్ స్టేషన్ ముట్టడి

61చూసినవారు
కరెంటు కోతలపై గిరిజనుల సబ్ స్టేషన్ ముట్టడి
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని మేఘ్య నాయక్ తండా వాసులు గన్నారం విద్యుత్ సబ్ స్టేషన్ ను శనివారం ముట్టడించారు. తమ గ్రామంలో నిత్యం కరెంటు కోతలు విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని ఆగ్రహించి సబ్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. డిచ్ పల్లి సిఐ మల్లేష్, ఎస్సై మనోజ్ కుమార్ లు తండా వాసులను సముదాయించి విరమింప చేశారు.

సంబంధిత పోస్ట్