ఖలీల్వాడి రైల్వే క్వార్టర్స్ సమీపంలో మృతదేహం లభ్యం

73చూసినవారు
ఖలీల్వాడి రైల్వే క్వార్టర్స్ సమీపంలో మృతదేహం లభ్యం
ఖలీల్వాడి నగరంలోని రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో మృతదేహం ఉంది అన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి వద్ద తాడు ఉండటంతో ఉరి వేసి చంపి ఉంటారు అని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు నవీపేట్ మండలంకు చెందిన గణేష్(30) గా గుర్తించినట్లు శనివారం రాత్రి ఎస్సై మహేష్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్