గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: ఎమ్యెల్యే

61చూసినవారు
గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: ఎమ్యెల్యే
గ్రామీణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ అన్నారు. గాంధారి మండలం పేట్ సంగెం గ్రామంలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను ఎమ్యెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ గ్రామాల పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు మార్చ్ ఫాస్ట్, నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమం చూస్తుంటే ఎర్రపహడ్ లో తను చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్