లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోయే మహిళా రెజ్లర్లకు పోలీసులు భద్రతను ఉపసంహరించుకున్నారని రెజ్లర్ వినేష్ ఫొగాట్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ పై దిల్లీ పోలీసులు స్పందించారు. “భద్రతను ఉపసంహరించుకునే ఉత్తర్వు ఇవ్వలేదు. భద్రతా అధికారి వారి వద్దకు చేరుకోవడంలో ఆలస్యం జరిగితే, ఆ విషయంపై విచారణ చేపడతాం" అని చెప్పారు.