పూరీ రత్నభాండాగారంలో రహస్య సొరంగాలు లేవు: పర్యవేక్షణ కమిటీ

58చూసినవారు
పూరీ రత్నభాండాగారంలో రహస్య సొరంగాలు లేవు: పర్యవేక్షణ కమిటీ
ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత తెరిచారు. రహస్య గదిలో పెద్ద పరిమాణంలో ఉన్న మూడు పెట్టెలు, 4 భారీ సైజు అల్మారాల్లో ఉన్న ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. లోపల విష సర్పాలున్నాయని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. సొరంగాలకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు గుర్తించలేదని.. రహస్య గదిలోకి వెళ్లొచ్చిన పర్యవేక్షణ కమిటీ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్