పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బైక్పై ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాద ఘటనపై విపక్షాల విమర్శలపై అడిగినప్పుడు.. ఇది రాజకీయాలకు సమయం కాదని సున్నితంగా వారించారు.