లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ కారణం చేతనైనా ఆఫీసుకు రాకపోతే హాజరుకానట్లుగా రిజిస్టర్లో వేసి ఆ రోజు వేతనాన్ని జీతం నుంచి కట్ చేస్తామని సర్క్యులర్ జారీచేసింది. ఈ మేరకు ‘నో వర్క్.. నో పే’ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.