ఇసుక టెండర్ల ఖరారు, ఒప్పందాల్లో వెంకటరెడ్డి నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఇసుక కాంట్రాక్టు సంస్థ జేపీవీఎల్ సంస్థ ప్రభుత్వానికి రూ.800 కోట్ల బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థ సమర్పించిన రూ.120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి తీసుకునేందుకు ఎన్ఓసీ జారీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. వెంకటరెడ్డి తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు తేల్చింది.