గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ పేరిట అన్ని స్కూళ్లలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదించిందని వెల్లడించారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని నష్టం చేసిందని మండిపడ్డారు. టెట్ పరీక్షను ప్రతి ఆర్నెళ్లకోసారి నిర్వహించాల్సి ఉండగా.. అలా చేయకపోవడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయారని పేర్కొన్నారు.