ఆధారాలు, సాక్ష్యాల మేరకే కవితకు నోటీసులు: బండి సంజయ్

5574చూసినవారు
ఆధారాలు, సాక్ష్యాల మేరకే కవితకు నోటీసులు: బండి సంజయ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులివ్వడంపై ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఇవాళ కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ సేకరించిన ఆధారాలు, సాక్ష్యాల మేరకే కవితకు నోటీసులు ఇచ్చారని అన్నారు. సీబీఐ, ఈడీ.. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అని, వాటిల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదన్నారు. ఆధారాలు ఉంటే తప్పు చేసింది ఎంతపెద్ద వారైనా ఉపేక్షించకూడదనేదే బీజేపీ విధానమన్నారు.

సంబంధిత పోస్ట్